నిస్పక్షపాతంగా ఎన్నికలు విధులు నిర్వర్తించాలి: ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అధికారులకు ఎంసీసీపై శిక్షణ
-------------------------------
రాజన్న సిరిసిల్ల, నవంబర్ - 25
-------------------------------
రానున్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అధికారులు నిస్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)పై వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొనకూడదని స్పష్టం చేశారు. విధుల్లో భాగంగా ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ లు సీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా వీడియో ఫుటేజ్ తీసుకోవాలని, ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని సూచించారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపధ్యంలో రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే పట్టుకుని, వీడియో తీసి పంచనామా చేయాలని, అనంతరం పట్టుకున్న డబ్బుకు సంబంధించి రసీదు అందజేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం, వాటిని పరిశీలించడంపై తెలియజేశారు. ఆయా మండలాల నోడల్ ఆఫీసర్లు తమ నివేదికను ప్రతి రోజు పంపించాల్సి ఉంటుందని తెలిపారు. ఎంసీసీ నోడల్ ఆఫీసర్ గా డీఆర్డీఓ శేషాద్రి ని నియమించారు. జిల్లా సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఉంటాయని తెలిపారు.
సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, డిప్యూటీ సీఈఓ గీత, డీపీఓ షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.