సిరిసిల్ల వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్

సిరిసిల్ల వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
సిరిసిల్ల పట్టణంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన స్వామి వారి రథోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ స్వామివారి రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ప్రభుత్వ విప్ ను ఘనంగా సన్మానించి ఆశీర్వచనం అందజేశారు.

స్వామి వారి దర్శనానికి దేవాదాయ ధర్మాదాయ శాఖా వారి ఆధ్వర్యంలో మెరుగైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు..స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకొన్నారు.

Post a Comment

Previous Post Next Post