రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం ఓటర్లు 4 లక్షల 76 వేల 435 మంది

4 లక్షల 76 వేల 435 ఓటర్లతో  తుది ఓటరు జాబితా విడుదల: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ


రాజన్న సిరిసిల్ల, జనవరి-06: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారత ఎన్నికల సంఘం ఆదేశాలు అనుసరించి ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం 2025 లో భాగంగా  4 లక్షల 76 వేల 435 ఓటర్లతో జిల్లా తుది ఓటరు జాబితా విడుదల చేశామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

  సిరిసిల్ల జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, వీటికి సంబంధించి మొత్తం 4 లక్షల 76 వేల 435 ఓటర్లతో తుది ఓటర్ జాబితా తయారు చేశామని, మహిళా ఓటర్లు 2 లక్షల 47 వేల 46 మంది, పురుష ఓటర్లు 2 లక్షల 29 వేల 352 మంది, ఇతర ఓటర్లు 37 మంది నమోదయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 169 సర్వీస్ ఓట్లు ఉన్నాయని   కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Post a Comment

Previous Post Next Post