నగదు 19,000/- రూపాయలు, ఒక ద్విచక్ర వాహనం,07 మొబైల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన సిరిసిల్ల టౌన్ ఇంచార్జ్ సి.ఐ సదన్ కుమార్
రాజన్న సిరిసిల్ల, 22 జూన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో సిరిగిరి చిన్న నర్సయ్య అనే వ్యక్తి ఇంట్లో డబ్బులు పందెం పెట్టుకుని రహస్యంగా పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు శుక్రవారం రోజున రాత్రి సమయంలో పేకాట స్థావరం పై దాడి చేసి పేకాట ఆడుతున్న 08 మంది వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 19,000/-రూపాయల నగదు, 07 మొబైల్ ఫోన్స్, ఒక ద్విచక్ర వాహనం, ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేయడం జరిగిందని సి.ఐ సదన్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ.. సులభ సంపాదనకు అలవాటుపడి కొంతమంది ఈ విధంగా చెడు వ్యసనాలకు అలవాటు పడి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతు ఆభరణాలు, వాహనాలను తాకట్టు పెడుతూ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యం పోలీస్ ల ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిరహిస్తామని అన్నారు. ఎవరైన గ్యాంబ్లింగ్, బెట్టింగులు, పేకాట వంటి జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటమని హెచ్చరించారు.
మీ ప్రాంతంలో ఇటువంటివి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నవి తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్100 కి సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అన్నారు.