మూడు నెలలలోగా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి

మూడు నెలలలోగా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి
ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

నిర్మాణాలకు ఇసుక ఉచితం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

అర్హత గల వారికే ఇండ్లు మంజూరు చేసిన కలెక్టర్ కు లబ్ధిదారుల కృతజ్ఞతలు


రాజన్న సిరిసిల్ల, జూన్ -05: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు
మూడు నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. గురువారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆయా మండలాల లబ్ధిదారులు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు విచ్చేయగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ వీరితో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. పేదలు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని వివరించారు. మంజూరు పత్రాలు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించేలా ఏర్పాట్లు చేస్తుందని వివరించారు. నిర్మాణానికి డబ్బులు లేని మహిళా సంఘాల సభ్యులకు గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా పట్టణాల్లో మెప్మా ద్వారా రూ. లక్ష రుణం అందిస్తామని, అందిస్తామని తెలిపారు. త్వరితగతిన ఇండ్లు మొదలు పెట్టాలని సూచించారు. బేస్మెంట్, ఇతర దశలు పూర్తి కాగానే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డ్ ఆఫీసర్ల తో ఫోటో తీయించి, అప్లోడ్ చేయించాలని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు. దీనికి ఎవరి పైరవీ అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. తమకు ఇండ్లు మంజూరు చేయించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు ఆయా గ్రామాల లబ్ధిదారులు కృతఙ్ఞతలు తెలిపారు. 

కార్యక్రమంలో పీడీ హౌసింగ్ శంకర్, వివిధ మండలాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post