శాసనసభ ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 144వ సెక్షన్‌ను విధించారు. 28 సాయంత్రం 5గంటల నుంచి 30 ఉదయం 6గంటల వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. 45వేల రాష్ట్ర పోలీసులు..3వేలు ఇతర శాఖలకు చెందిన రక్షకభటులు, 50 కంపెనీల ప్రత్యేక పోలీసులు, 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు . వీళ్లకు అదనంగా కర్నాటక, మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా నుంచి 23 వేల హోంగార్డులు సైతం ఎన్నికల్లో సేవలందించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి అధికారులు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించనున్నారు.

Post a Comment

Previous Post Next Post