సామాన్యులకు కన్నీళ్లు పెట్టిస్తున్నా ఉల్లి..!


హైదరాబాద్: అక్టోబర్ 27

ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మెున్నటి వరకు కిలో టమాట రూ. 200 పైగా పలకగా.. ఇప్పుడు ఉల్లి వంతు వచ్చింది. గత నెల క్రితం వరకు వందకు 6 కేజీల వరకు దొరికిన ఉల్లి.. ఇప్పుడు వందకు కేజీన్నరకు పడిపోయింది.


హైదరాబాద్ మార్కెట్లలో కిలో రూ. 60 - 70 విక్రయిస్తున్నారు. ఇలా కోయకుండానే ఉల్లి ధరలు సామాన్యులచే కంటతడి పెట్టిస్తున్నాయి.


దీపావళి పండగ సీజన్‌ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ అయిన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిశాయి.


దాంతో ఉల్లి పంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో వాటికి కొరత ఏర్పడింది. దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.


ఇక వర్షాలు సరిగాలేక కర్నూలు, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌, చేవెళ్లలో పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. నగరానికి రావాల్సిన 80 నుంచి 100 లారీల ఉల్లి పంటలో కేవలం 20 శాతం మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.


గత పదిహేను రోజులుగా, నిల్వ ఉంచిన ఉల్లిపాయల రాకపోకలు దాదాపు 40 శాతం తగ్గాయని అంటున్నారు. నవంబరు రెండో వారంలో స్థానికంగా ఖరీఫ్‌ పంట అందుబాటులోకి రానుండటంతో ధరలు తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post