Posted by Chief Editor Dayanand Jana
రాజన్న సిరిసిల్ల,10 అక్టోబర్(జనవిజన్ న్యూస్): ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల సిరిసిల్ల నందు సైకియాట్రి విభాగం డాక్టర్ ప్రవీణ్ చే ఎంబిబిఎస్ విద్యార్థులకు, హాస్పటల్ సిబ్బందికి మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసారు. ఈ ప్రోగ్రాం ద్వారా వారికి మానసిక ఒత్తిడి ఎలా తట్టుకోవాలో తగు సూచనలు చేశారు. మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ఎంబిబిఎస్ విద్యార్థులకు, కాలేజ్ సిబ్బందికి, హాస్పిటల్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్, సైకియాట్రీ విభాగం డాక్టర్ సతీష్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సాగరిక, సైకాలజిస్ట్ పున్నంచందర్, హాస్పిటల్, వైద్య కళాశాల వైద్యులు, ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.