వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని మంగళవారం హైకోర్టు రిజిస్టర్ జనరల్ ఆఫ్ తెలంగాణ తిరుమల దేవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించారు. వారికి ఆలయ పర్యవేక్షకులు అలీ శంకర్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, పోసాని రాజు ప్రసాదాలు అందజేశారు.
Tags
vemulawada