నిర్మాణదారులు మన ఇసుక వాహనంతోనే దరఖాస్తు చేసుకోవాలి
మన ఇసుక వాహనం, వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు
నేరుగా కూపన్లు ఇచ్చే విధానం రద్దు:
అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
---------------------------------
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ - 06
----------------------------------
నిర్మాణాదారులు ఇసుక కోసం *మన ఇసుక వాహనం* ద్వారా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సెంటర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన *మన ఇసుక వాహనం* అప్లికేషన్, ఆన్లైన్ వెబ్ సైట్ లో నిర్మాణదారులు ద్వారా తమకు నచ్చిన ఇసుక రీచ్ నుంచి ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని, దరఖాస్తు చేసుకోవడం చాలా సులభమని పేర్కొన్నారు. నిర్ణీత పత్రాలు జత చేస్తే ఇసుక పొందవచ్చని స్పష్టం చేశారు.
జిల్లా కమిటీ ఆమోదించిన ఇసుక రీచ్ ల నుంచే ఇసుక తరలించవచ్చని, ఇసుక తరలింపులో నేరుగా కూపన్లు ఇచ్చే విధానం రద్దు అయిందని వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా పొందే విధానం అమలు చేస్తున్నామని, ఇసుక కేటాయింపు, తరలింపు పూర్తి పారదర్శకంగా ఉంటుందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. మధ్యవర్తుల అవసరం లేకుండా ప్రజలు నేరుగా ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకునే సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కల్పించిందని, దీనివల్ల అక్రమ రవాణా నివారించబడుతుందని పేర్కొన్నారు.
అలాగే మన ఇసుక వాహనం విషయమై సమాచారం, వివరాలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ 040- 23120421/8333923732 ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయని, మెయిల్ ఐడీ *helpdesk.tsmiv@cgg.gov.in* సేవలు ఉన్నాయని తెలిపారు.
ఇసుక బుక్ చేసుకునేటప్పుడు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అధికారి జారీ చేసిన ధ్రువపత్రం, ఇతర ఇంటి నిర్మాణానికి సంబంధిత పంచాయతీ కార్యదర్శి, అధికారి జారీ చేసిన ఇంటి నిర్మాణ అనుమతి పత్రం, ప్రభుత్వ పనులకు సంబంధిత కార్య నిర్వహణ ఇంజనీర్ జారీ చేసిన అనుమతి పత్రం (అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ 200 కేబీ లోపల ఉండాలని పీడీఎఫ్, జేపీజీ విధానంలో ఉండాలి) తెలిపారు. నిర్మాణదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఇసుక పొందాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పిలుపు నిచ్చారు.