తిరుమలలో ఎమ్మెల్యే వివేక్ కుటుంబ సభ్యులు
తిరుమల, 08 జూన్: తిరుమలలో ఎమ్మెల్యే వివేక్ కుటుంబ సభ్యులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం శ్రీవారి దర్శనానికి తిరుపతికి వెళ్లారు. రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న వివేక్ వెంకటస్వామి, ఆయన కొడుకు, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణకు అభిమానులు, దళిత నాయకులు ఘన స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. కుటుంబ సభ్యులతో కలిసి వారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.