10 విశ్వవిద్యాలయలకు వైస్ చాన్సులర్ల నియామకం

హైదరాబాద్, మే 21: తెలంగాణలోని 10 విశ్వవి ద్యాలయాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంఛార్జి వైస్ ఛాన్స్‌లర్లను నియమిం చింది. వీసీలుగా.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ మంగళవారం రోజున సర్కారు అధికారిక ఆదేశాలు జారీ చేసింది. 

కాగా.. లిస్టులో సీనియర్ ఐఏఎస్ అయిన శైలజా రామయ్యర్‌ను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాల యానికి వీసీగా ప్రభుత్వం నియమించింది. 

తెలంగాణ యూనివర్సిటీకి వీసీగా సందీప్ సుల్తానియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్‌ను జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనాన్స్‌ వర్సిటీకి వీసీగా నియమించింది రేవంత్ రెడ్డి సర్కార్..

కొత్తగా నియమితులైన వీసీలు వీరే...

ఉస్మానియా యూనివర్సిటీ- దాన కిషోర్‌

తెలంగాణ యూనివర్సిటీ- సందీప్‌ సుల్తానియా

పాలమూరు యూనివర్సిటీ- నదీం అహ్మద్‌

కాకతీయ యూనివర్సిటీ- కరుణ వాకాటి

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ- శైలజ రామయ్యర్‌

జేఎన్‌టీయూ - బుర్రా వెంకటేశం

మహాత్మాగాంధీ యూనివర్సిటీ- నవీన్‌ మిట్టల్‌

శాతవాహన యూనివర్సిటీ- సురేంద్రమోహన్‌

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనాన్స్‌ వర్సిటీ - జయేష్ రంజన్‌

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ- సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ

Post a Comment

Previous Post Next Post