రాజన్న సిరిసిల్ల జిల్ల: సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్, బిజెపి పార్టీలు అధికారంలో ఉండి నేతన్నల మీద శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేతన్నల కోసం ప్రయోజనాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం చేనేత బోర్డ్ రద్దు చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది, తెలంగాణకు ఎన్ని ఇచ్చారు అని ప్రశ్నించారు. ఈనెల 10న పూర్తి వివరాలు ఇస్తానని అన్నారు. మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ కి ఇచ్చారు సిరిసిల్లకు ఎందుకు ఇవ్వలేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పాపం ఎవరిది కేటీఆర్, మీరు చేసింది కాదా అని అన్నారు. నేతన్నలకు మూడు వందల యాభై కోట్ల రూపాయల బకాయి ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటన్న నెరవేర్చారా అని అడిగారు. నేతన్నలకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పిస్తాం. ఎవరు ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు. తమ ప్రభుత్వం వస్త్రాల ఆర్డర్ల పట్ల జివో తీసుకొచ్చాం. మూడు నెలలలో సిరిసిల్లకి 120 కోట్ల ఆర్డర్ ఇచ్చినం అని అన్నారు. ఇక్కడి నుండి వస్త్ర పరిశ్రమ ఎగుమతులు చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేతన్నలకు చేతులు జోడించి చెపుతున్న చావులు పరిష్కారం కాదని అన్నారు. రెండు పార్టీల మాటలు విని ఆగం కావద్దని అన్నారు. గత ప్రభుత్వాల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చి నేతన్నలను ఆదుకుంటామని చెప్పారు. నేతన్న ల బకాయిలు విడుతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన ఆరు లక్షల కోట్ల అప్పును భరిస్తున్నమని స్పష్టం చేశారు. సిరిసిల్ల నేతన్నల చేతిలో చిప్ప పెట్టి మేఘ టెక్స్టైల్ పార్క్ వరంగల్ తరలిచుకపోయింది మాజి ఎంపి వినోద్ కుమార్ అని గుర్తు చేశారు. బిజెపి రాముని ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగే పరిస్థితి ఉందని చెప్పారు. నేతన్నలు మీరు రెండు పార్టీల ట్రాప్ లో పడకండి మేము ఉన్నామని భరోసానిచ్చారు. నేతన్నల సమస్యలు చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కరెంటు సబ్సిడీ ఇస్తూ, బిసి కార్పొరేషన్ లో లోన్లు ఇచ్చి అన్ని వర్గాల వారిని ఆదుకుంటామని అన్నారు. నేతన్నల, గీతన్న లు ఒక్కటేనని పునరుద్గాటించారు. ఒక్క మేఘ క్లస్టర్ తీసుకొచ్చే సోయి ఉందా బి, బిజెపి పార్టీలకు కానీ సవాల్ విసిరారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చి మా ప్రభుత్వం ఆదుకుందని గుర్తు చేశారు. అంత్యోదయ కార్డులు రద్దు చేసింది ఇక్కడ కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల పేరు మీద శవ రాజకీయాలు చేయకండని అన్నారు. అధికారులు ఎవరన్నా నిర్లక్ష్యం చేస్తే ప్రజల ముందు నిలదీస్తామని తెలిపారు. తమది ప్రజల ప్రభుత్వం, ఎవరు నిరాశ చెందొద్దని అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా మేము అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు. నేతన్నల కు భరోసా ఇవ్వడానికే నేను సిరిసిల్లకు వచ్చిన అని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రెస్ మీట్ లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, టిపిసిసి ప్రచార కమిటీ సభ్యులు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.