మూసివేసిన పాఠశాలను తిరిగి తెరిపించాలి: కౌన్సిలర్ బొల్గం నాగరాజు

రాజన్న సిరిసిల్ల,12 అక్టోబర్(జనవిజన్ న్యూస్): సిరిసిల్ల పట్టణం పదవ వార్డ్ మున్సిపాలిటీ పరిధిలోని ముష్టిపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల గత రెండున్నర సంవత్సరాల నుంచి మూసి వేయబడి స్థానిక బడి ఈడు పిల్లలకు చదువుకోవడం ఇబ్బందికరంగా మారడంతో, పాఠశాలను తిరిగి తెరిపించాలని కోరుతూ విద్యాశాఖ అధికారికి కౌన్సిలర్ బొల్గం నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. మూసివేసిన పాఠశాలలో విధులు నిర్వహించే ఇద్దరు ఉపాధ్యాయులను దగ్గరలో గల రాజీవ్ నగర్ పాఠశాలకి డిప్యూటేషన్ చేయడం జరిగిందని కౌన్సిలర్ తెలిపారు. భారత రాజ్యాంగంలో తెలుపబడిన ఆర్టికల్ 21 A ప్రకారం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు ఖచ్చితంగా ఉచిత నిర్బంధ విద్యను అందించాల్సిన విది ప్రభుత్వానికి ఉంటుందని నాగరాజ్ పేర్కొన్నారు. పాఠశాల మూసివేసిన నుండిి ముష్టిపల్లి గ్రామంలోని ఆరు నుంచి 14 సంవత్సరాల లోపు గల బాల బాలికలు పాఠశాలకు వెళ్ళ లేక పోతున్నారని తెలిపారు. దీంతో వేల రూపాయలు ఫీజులు కట్టలేక, ప్రైవేట్ స్కూల్స్ కి పంపించలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంం పట్ల ఉన్నతాధికారులు స్పందించి, ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దుచేసి మళ్లీ పాఠశాలకు వచ్చేలా చేయాలని కోరారు. ఈ సందర్భంగా బొల్గాం నాగరాజ్ గౌడ్ జిల్లా అదనపు కలెక్టర్ తో పాటు విద్యాశాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల విద్యాా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post