విజయవాడ,12 అక్టోబర్(జనవిజన్ న్యూస్):
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అలయ నూతన ఈఓ గా కె.ఎస్.రామారావు బాధ్యతలు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకొని, వేదపండితుల ఆశీర్వచనం అనంతరం భాద్యతలు స్వీకరించారు.
గత ఈఓ భ్రమరాంబకు వేదపండితుల ఆశీర్వచనం, ప్రసాదములు, అమ్మవారి చిత్రపటం, వస్త్రములు అందజేసి, గౌరవ మర్యాదలతో నూతన ఈఓ వీడ్కోలు పలికారు. అందరి సమన్వయముతో దసరా ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తామని నూతన ఈఓ తెలిపారు.