రాజన్నసిరిసిల్ల, 18 అక్టోబర్(జన విజన్ న్యూస్): రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఐదు చెక్ పోస్ట్ లతో పాటుగా ఐదు టీమ్స్ తో డైనమిక్ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం బుధవారం వేములవాడ పట్టణం కోరుట్ల బస్టాండ్ వద్ద వాహన తనిఖీల్లో జిల్ల ఎస్పీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
అసెంబ్లి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకే జిల్లాలో విస్తృత వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుందని ప్రజలు, వాహనదారులు ఎన్నికల నియమావళి పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకూ ఐదు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడంతో పాటుగా 05 టీమ్స్ ఏర్పాటు చేసి జిల్లాలో డైనమిక్ తనిఖీలు నిర్వహిస్తూన్నామని అన్నారు. అక్రమంగా నగదు, మద్యం, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.
ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్ర చారి, సి.ఐ కరుణాకర్, ఆర్.ఎస్.ఐ శ్రవణ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు..