గంభీరావుపేట సామాజిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..
సిరిసిల్ల జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డా. పెంచలయ్య ఈ రోజు గంభీరావుపేట సామాజిక ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డెంగ్యూ జ్వరం తో చేరి వైద్యం పొందుతున్న సింగారం గ్రామానికి చెందిన యువకున్ని పరామర్శించి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఓ పి సేవలు,ల్యాబ్ సేవలు,ఫార్మసీ మరియు అత్యవసర విభాగాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రి కి వచ్చే రోగులకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వీరి వెంట డా.సింధు, డా.సుష్మ, నాగరాజు, రంజిత్, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.