తెలంగాణ మహిళ కమిషన్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పిన వేణు స్వామి
సినీ నటుడు నాగచైతన్య పట్ల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్న వేణు స్వామి.. గతంలో నాగచైతన్య, శోభిత లు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోష్యం చెప్పిన వేణు స్వామి. ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పిన వేణు స్వామి. వేణు స్వామి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు. దీనిపై వేణు స్వామికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ మహిళ కమిషన్. తెలంగాణ మహిళ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టు ఆశ్రయించిన వేణు స్వామి. మహిళ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పిన హైకోర్టు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి మరొకసారి నోటీసులు జారీ చేసిన ఉమెన్ కమిషన్. నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన వ్యాఖ్యలను ఉపసరించుకున్నట్లు తెలిపిన వేణు స్వామి. ఉమెన్ కమిషన్ ను క్షమాపణ కోరిన వేణుస్వామి.
ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని వేణు స్వామిని హెచ్చరించిన మహిళ కమిషన్