గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన శునకాన్ని తొలగించిన అదనపు ఎస్పీ
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్ల ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపుర్ గ్రామం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్ పై కన్నుమూసిన శునకాన్ని, విధినిర్వహణలో అటు వైపు నుండి వస్తున్న అదనపు ఎస్పీ చంద్రయ్య వాహనం అపి రోడ్ పై మరణించి ఉన్న శునకాన్ని తీసి రోడ్ పక్కన వేసి మానవత్వం చాటుకున్నారు.
రోడ్ ప్రమాదాల్లో మరణించినా లేదా కొన ప్రాణంతో ఉన్న శునకలను తీసి పక్కకు పెట్టాలని ఆయన సూచించారు. లేని యెడల మరణించిన శునకాన్ని తప్పించే సందర్భాల్లో రోడ్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. జంతువుల పట్ల ప్రతి ఒక్కరు మానవతాదృక్పథంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.