దేశంలో కేజీ ఉల్లి సగటు ధర రూ.50

దిల్లీ: దేశంలో ఉల్లిపాయల అధిక ధరలు కొనసాగుతున్నాయి. రాజధాని దిల్లీలో కేజీ ఉల్లి చిల్లర ధర రూ.78 పలుకుతుండగా, దేశవ్యాప్తంగా సగటు కనిష్ఠ ధర రూ.50.35గా ఉంది..

గరిష్ఠంగా రూ.83 ఉంది. ఈ క్రమంలో విదేశాలకు ఎగుమతి చేసే ఉల్లిపై టన్నుకు కనీస ఎగుమతి ధర 800 డాలర్లను విధించాలని కేంద్రం నిర్ణయించింది. డిసెంబరు 31వరకు ఈ విధానాన్ని అమలు చేయనుంది..

ఎగుమతులను నిరుత్సాహపరిచి దేశీయ మార్కెట్‌లో తగినంత సరుకును అందుబాటులో ఉంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాలశాఖ ఒక ప్రకటనలో తెలిపింది..

Post a Comment

Previous Post Next Post