సిరిసిల్ల : సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామాజిక ఉద్యమ నాయకుల జయంతులు, వర్ధంతులను పురస్కరించుకొని సామాజిక అణచివేత సమస్యలపై సర్వేలు చేపట్టి సమస్యల పరిష్కారం కోసం సామాజిక సంఘాలతో కలిసి రాబోయే రోజుల్లో చేపట్టే పోరాటాలు, ఉద్యమాలకు మద్దతుగా, సంఘీభావ నిధికి సహకరించాలని పత్రికా ప్రకటన ద్వార పిలుపునిచ్చారు. కార్మిక లోకమంతా సామాజిక సంఘీభావ నిధి అందించి సామాజిక అనిచివేతకు వ్యతిరేకంగా సమానత్వం కొరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో తమవంతు భాగస్వాములు కావాలంటూ సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పత్రికా ప్రకటన ద్వార విజ్ఞప్తి చేశారు.
సామాజికోద్యమ సంఘీభావ నిధి అందించి సహకరించండి: సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ
byJanavisiontv
-
0