కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
ఆలయ అర్చకులు డిప్యూటీ చైర్మన్ కు ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి స్వస్తి పలుకుతూ ఆహ్వానించారు.
స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి కోడేమొక్కులు చెల్లించుకున్నారు.
నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదొక్త ఆశీర్వచనము చేసి శేష వస్త్రము కప్పినారు, ఆలయ పరిరక్షకులు బి తిరుపతిరావు లడ్డు ప్రసాదము అందజేసినారు.
వీరి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు తదితరులు ఉన్నారు